Breaking News

30/10/2019

వైకాపా కార్యకర్తలకే పథకాలు

విజయవాడ అక్టోబర్ 30   (way2newstv.in)
విజయవాడ సింగ్ నగర్ లో బీజేపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్  బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా రామ్ మాధవ్ మాట్లాడుతూ నాలుగు నెలల కాలంలో ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధంగా చేసిందని ఆరోపించారు. గతంలో టీడీపీ, ఇపుడు వైసీపీ కూడా కేంద్ర పధకాలను తమ పధకాలుగా చెబుతోంది. 
వైకాపా కార్యకర్తలకే పథకాలు

లబ్ధిదారుల ఎంపిక వైసీపీ కార్యకర్తలకు కమిటీల ద్వారా చేయటం సరికాదు. టీడీపీ ని వదిలి చాలా మంది వదిలి వెళ్తున్న కారణంగానే చంద్రబాబు బీజేపీ.పొత్తు వదిలామని బాధ పడుతున్నారని భావిస్తున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ముందుకు వెళ్లాలని ఆ దిశగా పార్టీ ని అభివృద్ధి చేయాలని పని చేస్తున్నామని అన్నారు. ఏపీ లో నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి బీజేపీ జూనియర్ పార్టీ గా వ్యవహరించదని అన్నారు.

No comments:

Post a Comment