Breaking News

30/10/2019

అందినకాడికి ఇసుకను దోచుకున్నారు

తాడేపల్లి అక్టోబర్ 30  (way2newstv.in)
గత ఐదేళ్లలో ఇసుకను అందినకాడికి దోచుకున్నారు. ఇసుక కొరత లేకుండా అవినీితికి తావులేకుండా ముఖ్యమంత్రి ఇసుకపాలసీ తీసుకువచ్చారు. ఎల్లో మీడియా ఇసుకపై చంద్రబాబుకు అనుకూలంగా ప్రభుత్వంపై అసత్యప్రచారం చేస్తోందని ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి  ఆరోపించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. వరదలవల్ల ఇసుక కొరత కొంత ఉన్నమాట వాస్తవమే. 
అందినకాడికి ఇసుకను దోచుకున్నారు

లోకేష్ ఇసుక దీక్ష డైటింగ్ కోసం చేస్తున్నట్లుగా ఉంది.  గతంలో టిడిపి పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో రాష్ర్ట ప్రయోజనాలు  ఏమీలేవు, దీక్షలు వళ్లు తగ్గించుకుంటానికి చేయాల్సిందే అంటూ నవ్వులాటలుగా మాట్లాడిన మాటలు ప్రజలు మరిచిపోలేదని అన్నారు. భవననిర్మాణకార్మికులకు మీరు చేసిన మోసం తెలిస్తే కార్మికులు నిన్ను,నీ కుమారుడు లోకేష్ ను తరిమికొడతారు. భవన నిర్మాణకార్మికులకు పదివేల కోట్లు వచ్చే అవకాం వుందని అయన అన్నారు.

No comments:

Post a Comment