Breaking News

10/10/2019

14 ఏళ్ల చిన్నారికి ప్రసవం

నిజామాబాద్, అక్టోబరు 10 (way2newstv.in)
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల ఓ మైనర్ బాలిక ప్రసవించింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ చిన్నారికి జన్మనిచ్చింది. స్థానికంగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఫయాజ్ అనే వ్యక్తి బాధిత బాలికను లొంగదీసుకొని లైంగికంగా వాడుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది.బాధిత బాలికకు పురిటి నొప్పులు రావడంతో ఆమె తల్లిదండ్రులు  ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. 
తెలంగాణలో తమిళ రాజకీయం

బుధవారం తెల్లవారుజామున ఆమె నార్మల్ డెలివరీతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలిక తల్లిదండ్రులు ఆ శిశువును గుట్టు చప్పుడు కాకుండా విక్రయించేందుకు ప్రయత్నించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.శిశువును విక్రయానికి పెట్టిన విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీసీవో లలితా కుమారి, ఆదర్శ యువతి మహిళా మండలి అధ్యక్షురాలు పద్మా సింగ్ ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నారిని తీసుకొని, స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ పరువు పోతుందని భావించే.. ఆ శిశువును అమ్మకానికి పెట్టినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ ఫయాజ్ కోసం గాలిస్తున్నారు.

No comments:

Post a Comment