Breaking News

18/09/2019

ఆరేళ్లలో నాలుగు మెడికల్ కాలేజీలు

హైద్రాబాద్, సెప్టెంబర్ 18, (way2newstv.in)
లంగాణ రాష్ట్రంలో కొత్తగా 4 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నమని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి ఈటల సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 5 మెడికల్‌ కాలేజీలు ఉండేవని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో కొత్తగా మెడికల్‌ కాలేజీలు పెట్టాలని మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ఒక్కో కాలేజీని 150 సీట్లతో ప్రారంభించడం జరిగిందన్నారు.
ఆరేళ్లలో నాలుగు మెడికల్ కాలేజీలు

కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉన్న కార్మిక శాఖతో సంప్రదింపులు జరిపి..ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆనాడు పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మన ఎంపీలు పోరాడి..బీబీ నగర్‌లో ఎయిమ్స్‌ను ప్రారంభించుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వపరంగా 11 మెడికల్‌ కాలేజీలు, ప్రైవేట్‌ పరంగా 23 మెడికల్‌ కాలేజీలున్నాయన్నారు. వీటిలో మొత్తం 4790 సీట్లుండగా..1640 సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నాయని, ఈఎస్‌ఐ కాలేజీలో 100 సీట్లు , ఎయిమ్స్ లో 50 సీట్లు ఉన్నాయని చెప్పారు. మెడికల్ కాలేజీల్లో పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ చేసినం. మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఇతర సిబ్బందిని పదోన్నతులు, ఇత్తర పద్దతుల ద్వారా భర్తీ చేశామన్నారు

No comments:

Post a Comment