భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 26, (way2newstv.in)
భద్రాద్రి కొత్త గూడెంజిల్లా భుర్గంపాడ్ మండలం పరిధిలో ఉన్న సారపాక గ్రామ పంచాయతీ లోని సుందరయ్య నగర్, గాంధీ నగర్, బాస్కర్ నగర్ ప్రాంతాల్లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ ప్రాంతంలో ని రహదారులు,డ్రైనేజీ లు,త్రాగునీరు సమస్యలు పరిష్కరించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే రేగా పర్యటన.......
స్పందించిన ఎమ్మెల్యే సంబంధింత అధికారులు కు సుందరయ్య నగర్ లో 3 లక్షల రూపాయల విలువ గల డ్రైనేజి నిర్మాణం చేయాలని ఆదేశాలు జారీచేశారు. మిగిలిన పలు సమస్యలను అంచలంచలుగా అభివృద్ధి పనులు ముమ్మరంగా చేస్తామని గ్రామస్తులు కు హమీ ఇచ్చారు. అభివృద్ధి పనులు జరిగే సమయంలో అందరు సహకారాన్ని అందించాలని సూచించారు.
No comments:
Post a Comment