Breaking News

24/08/2019

అమరావతిలోనే రాజధాని వుండాలి

విజయవాడ ఆగష్టు 24 (way2newstv.in - Swamy Naidu)
రాజధాని అమరావతిలోనే ఉండాలని, అక్కడి నుంచి తరలించకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిలో పవన్ ను రాజధాని  ప్రాంత రైతులు కలిశారు. ఈసందర్భంగా జనసేనాని మాట్లాడుతూ…. రాజధాని రైతుల ఆవేదన అర్థం చేసుకున్నానని, వారికి అండగా నిలుస్తానన్నారు.

గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానికి కాదని.. రాష్ట్రమంతటిదని పవన్ అన్నారు.  ఈనెల 30, 31 తేదీల్లో ఏపీ రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రాజధాని ప్రాంత రైతులను పవన్ కల్యాణ్  కలవనున్నారు. రాజధానిలో ఇప్పటికే చేపట్టిన పనులు, నిలిచిన ప్రాజెక్టులను పవన్ పరిశీలించనున్నారు.

No comments:

Post a Comment