Breaking News

20/08/2019

కిడ్నాపర్లు ఆరెస్టు

ఏలూరు, ఆగష్టు 20 (way2newstv.in - Swamy Naidu):
పశ్చిమగోదావరి జిల్లా ఏలేశ్వరంలో బాలుడిని కిడ్నాప్‌ చేసిన నిందితుడిని పెద్దాపురం పోలీసులు అరెష్టు చేశారు.కిడ్నాప్‌కి పాల్పడిన బాలుడి బంధువు రమేష్‌ అని పోలీసులు నిర్ధారించారు.మండలంలోని యర్రవరం గ్రామానికి చెందిన ధనుష్‌ ఏలేశ్వరంలోని ప్రైవేట్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు.
కిడ్నాపర్లు ఆరెస్టు
పాఠశాల నుంచి ఇంటికి వచ్చే సమయంలో ధనుష్‌ కిడ్నాప్ కు గురయ్యాడు.అయితే ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో గాలింపు కొనసాగుతున్న సమయంలో ఏలేశ్వరం జూనియర్‌ కళాశాల వెనుక ఉన్న బాలుడిని గుర్తించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.బాలుడికి వరుసకు చిన్నాన్న అయిన తోట రమేష్‌ కిడ్నాప్‌ చేశాడని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment