Breaking News

12/08/2019

ముగిసిన పవిత్రోత్సవాలు

యాద్రాద్రి  ఆగస్టు12 (way2newstv.com - Swamy Naidu):
పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు ముగిశాయి. గత మూడు రోజుల నుంచి జరుగుతున్న పవిత్రోత్సవాలకు పూర్ణాహుతితో పరిసమాప్తి పలికారు ఆలయ అర్చకులు.అనంతరం స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలధారణ చేసి, ఆలయ అధికారులకు, భక్తులకు పవిత్ర మాలల వితరణ వేశారు. దీంతో పవిత్రోత్సవాలు ముగిశాయన్నారు ఆలయ అధికారులు. 
 ముగిసిన పవిత్రోత్సవాలు
పవిత్రోత్సవాల సందర్భంగా గత రెండు రోజుల నుంచి రద్దు చేయబడిన ఆర్జిత సేవలు, నిత్య శాశ్వత కల్యాణాలు రేపటి నుంచి పునరుద్ధరించనున్నారు. ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజల్లో తెలిసీ తెలియక ఏవైనా తప్పులు జరిగుంటే, ఆ తప్పులు చెరిగిపోవడం కోసం శాస్త్రబద్ధంగా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలను నిర్వహిస్తామని, అదే ఆనవాయితీని ఈసారి కూడా పాటించామన్నారు ఆలయ అర్చకులు. తెలిసీ తెలియక చేసిన తప్పులను మన్నించి,మాపై కరుణా కటాక్షాలు చూపించాలని కోరుతూ స్వామివారికి పవిత్రోత్సవ ఉత్సవాలు జరిపామన్నారు ఆలయ అర్చకులు.

No comments:

Post a Comment