Breaking News

27/08/2019

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి

శంషాబాద్, ఆగష్టు 27  (way2newstv.in - Swamy Naidu)
గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయ సమావేశం షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్ లో షాద్ నగర్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. సైబరాబాద్ పరిధిలో గణేశ్ ఉత్సవాలలో చట్ట విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని, డీజేకు ఎలాంటి అనుమతి లేదని అన్నారు. విగ్రహాలను ఏర్పాటు చేసే వద్ద తప్పని సరిగా ఎన్ఓసి తీసుకోవాలని, విద్యుత్ సప్లై కి తప్పనిసరిగా డిడి రూపంలో అనుమతి తీసుకోవాలాని, విగ్రహాలు ఏర్పాటు చేసే స్థలంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ మరియు నిమజ్జనంకు సంబంధించిన రూట్ మ్యాప్ స్థానిక పోలీసులకు ఇవ్వాలని తెలియజేశారు. 
శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి
ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఆర్డీఓ కృష్ణ, ఫరూక్ నగర్ మండల తహసిల్దార్ రాజేశ్వర్ రెడ్డి ,షాద్ నగర్ ఎస్సై విజయ్ భాస్కర్ ,ఆరు మండలాల ఎస్సై లు పోలీసు అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment