Breaking News

02/08/2019

హరితహారంలో పాల్గోన్న ఎమ్మెల్యేలు

కొల్లాపూర్, ఆగష్టు 2  (way2newstv.in)
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమములో భాగంగా శుక్రవారం  కొల్లాపూర్ పట్టణంలోని  మినీ స్టేడియం, ఆర్టీసీ బస్టాండ్ లలో హరిత హారం కార్యక్రమములో మొక్కలు నాటుతున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు,నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజులసురేందర్ గారు పాల్గొన్నారు,ఈ సందర్బంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు 
 హరితహారంలో  పాల్గోన్న ఎమ్మెల్యేలు 

మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్  గారినాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లో దూసుకుపోతుందని అన్ని వర్గాల ప్రజలు హరితహారంలో పాల్గొని తెలంగాణా రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణా గా  మార్చడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కొల్లాపూర్ ను ఆకుపచ్చని కొల్లాపూర్ గా  మార్చాలని ప్రతి ఒక్కరు సహకరించి ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో 10 మొక్కలు నాటుకోవాలని చెప్పారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, సిబ్బంది ,మహిళా సంఘాలు, విద్యార్థులు అధ్యాపకులు,టిఆర్ఎస్ పార్టీ  నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు

No comments:

Post a Comment