Breaking News

10/07/2019

కడపలో కన్నా లక్ష్మినారాయణ

కడప జూలై 10, (way2newstv.in)
జిల్లా పర్యటన నిమిత్తం నగరానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు  ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి బిజెపి నేతలు భారీ  ర్యాలీ నిర్వహించింది. ముందుగా అయన విజయ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. ఆలయంలో అయనకు  పూర్ణకుంభంతో వేదపండితులుస్వాగతం పలికారు. 
కడపలో కన్నా లక్ష్మినారాయణ

తీర్థప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించారుఏ. కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ దేశంలో ఎక్కువ సభ్యత్వాలు ఉన్న పార్టీ బీజేపీ. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల నుంచి అనేక మంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా వున్నారని అన్నారు. బీజేపీ ఎపిలో బలమైన పార్టీగా అవతరించనున్నది. 2024లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నామని అన్నారు. పార్టీ జాతీయ అద్యక్షులు అమిత్ షా ఉత్తరాది రాష్ట్రాలపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారని కన్నా వెల్లడించారు. 

No comments:

Post a Comment