Breaking News

05/07/2019

లోకేష్ పై విజయసాయి సెటైర్లు


హైద్రాబాద్, జూలై 5, (way2newstv.in)
ఏపీలో వైసీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రభుత్వ పాలన, సీఎం జగన్ టార్గెట్‌గా మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ బాంబ్స్ పేలుస్తుంటే.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అదే రేంజ్‌లో కౌంటరిస్తున్నారు. లోకేష్ గురువారం రోజు ఆకాశం మీద ఉమ్మేయొద్దంటూ చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి సెటైర్లు పేల్చారు. 

లోకేష్ పై విజయసాయి సెటైర్లు

వరుస ట్వీట్లలో చంద్రబాబు, లోకేష్‌‌లను టార్గెట్ చేశారు. చంద్రబాబు గారేమో ఆకాశమంట, లోకేశేమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట. ఆకాశంపై ఉమ్మేయొద్దని సలహా ఇస్తున్నాడు. అందనంత స్థాయి అని మీకు మీరే పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా?’ అంటూ లోకేష్‌ను ఎద్దేవా చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు గారేమో ఆకాశమంట, లోకేశేమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట. ఆకాశంపై ఉమ్మేయొద్దని సలహా ఇస్తున్నాడు. అందనంత స్థాయి అని మీకు మీరే  పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా?చంద్రబాబు గారూ పిల్లి శాపాలకు ఉట్లు తెగవు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమట. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం వీలు కాదంట. తన వల్ల కాని పనులను ఇంకెవరూ చేయలేరన్నట్ట సెలవిచ్చారు. అన్నమాట ప్రకారం జగన్ గారు చేసి చూపిస్తారు. మీరూ చూస్తారు’అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు గారూ పిల్లి శాపాలకు ఉట్లు తెగవు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమట. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం వీలు కాదంట. తన వల్ల కాని పనులను ఇంకెవరూ చేయలేరన్నట్ట సెలవిచ్చారు. అన్నమాట ప్రకారం జగన్ గారు చేసి చూపిస్తారు. మీరూ చూస్తారు.లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ల్యాండ్‌పూలింగ్‌లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్టు మార్చి 6, 2016 న చంద్రబాబు ప్రకటించారు. రికార్డుల్లో మాత్రం అది ఇప్పటికీ లింగమనేని పేరనే ఉంది. తర్వాత దాని రెనోవేషన్ కోసం 8 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంతకీ అది ఎవరిదో చంద్రబాబు గారే చెప్పాలి?’అంటూ ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. 

No comments:

Post a Comment