Breaking News

09/07/2019

వైకాపా దాడులను ఖండిస్తున్నా

కడప జూలై 9, (way2newstv.in)
కార్యకర్తలను కాపాడు కోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమే. వైసీపీ నేతలు చేస్తున్న దాడులను ఖండిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అయన కడప ఎయిర్ పోర్టు లో మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలపై దాడులకు నిరసన వ్యక్తం చేస్తున్నా.
వైకాపా దాడులను ఖండిస్తున్నా

ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించేది లేదని అన్నారు. టీడీపీ కి సహాకరించిన ప్రజలపై కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రిపోర్టర్లపై మీడియా పై దాడులకు దిగి పత్రికా స్వేచ్ఛను హారిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అయన ఆరోపించారు. ఎన్నికల్లో ఓటములు సర్వసాధారణం. దాడులు చేయడం మంచి పద్ధతి కాదంటు వైసీపీ నేతలకు బాబు హెచ్చరించారు. 

No comments:

Post a Comment