Breaking News

16/07/2019

మున్సిపల్ ఎన్నికలకు ఆశావాహులు క్యూ...

నిజామాబాద్, జూన్ 16,(way2newstv.in)
మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాబోతుందనే సంకేతాలతో  నేతల వద్దకు క్యూ కడుతున్నా ఆశావహులు, ప్రధాన పార్టీల్లో ఆశావహుల సందడితో పోలిటికల్‌ హీట్‌, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ పోరుపై కథనం.నేదో రేపోడో రేపో మున్సిపల్ షెడ్యూల్ వస్తు న్న నేపథ్యంలో పోటీకి ఆసక్తి చూపుతున్నరు. అవకాశం కలిసొస్తే పోటీకి తాము సిద్ధమేనంటూ వర్తమానం పంపుతున్నారు. తమ పార్టీ నేతలను కలిసి ఫలనా వార్డు నుంచి తమకు చాన్స్‌ దక్కేలా చూడాలని ఇప్పటి నుంచే ప్రయ త్నాలను మొదలు పెడుతున్నారు. పోరుగడ్డ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ నగర కార్పోరేషన్ తో పాటు ఆర్మూర్,బోధన్,కొత్తగా ఏర్పడ్డ బీంగల్ లతో పాటు కామారెడ్డి జిల్లాలోని  కామారెడ్డి, కొత్తగా ఏర్పడ్డ ఎల్లారెడ్డి, బాన్సు వాడలో పోలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. 
మున్సిపల్ ఎన్నికలకు ఆశావాహులు క్యూ...

పురపాలక ఎన్నికలను ఎదుర్కోవడానికి రాజకీయ పార్టీలు సన్నద్దం అవుతుండగా ఆశావహుల ప్రయత్నాలతో రాజకీయ సం దడి మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు విసృత్తంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల వార్డుల పునర్విభజన, ఓటర్ల ముసాయిదా, ఓటర్ల కుల గణన ఓటర్ల జాబితా విడుదల చేశారు. దీంతో కౌన్సి లర్లుగా పోటీ చేయాలనుకునే ఆశావహులు వార్డుల వారీ గా లెక్కలు వేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉండే వార్డు ఏదీ? తమ సామాజిక ఓటర్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. పోటీ కోసం తహతహలాడుతున్న ఆశావహులు త మ పార్టీ నేతలను తరచూ కలుస్తున్నారు. ము ఖ్యంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా కన్పిస్తోంది. ఒక్కొక్క వార్డు నుం చి ముగ్గురు, నలుగురు చొప్పున పోటీకి సిద్దప డుతున్నట్లు తెలుస్తోంది.మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆశావహులు తమకు సంబంధించిన వారిని ఓట ర్లుగా నమోదు చేస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రకటించినప్పటికీ నూతన ఓటర్ల నమోదుకు ఎన్ని కల కమిషన్‌ మరో అవకాశాన్ని కల్పించింది. ఎన్ని కల నోటిఫికేషన్‌కు సరిగ్గా ఏడు రోజుల ముందు వరకు ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఆశావహు లు తమ వార్డుల్లో నూతన ఓటర్లను చేర్పించడం కోసం పోటాపోటీగా దరఖాస్తులు చేస్తున్నట్లు తెలు స్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని సైతం పట్టణంలోని ఇంటి నంబర్లతో ఓటర్లుగా నమోదు చేయిస్తున్నట్లు సమాచారం. తాము చేర్పించే వారికే ఓటు హక్కు వస్తే తమకు అనుకూలంగా ఫలితం వస్తుందనే ముందుచూపుతో ఓటర్లగా నమోదు చేయించడానికి పో టీ పడుతున్నట్లు తెలుస్తోంది.మున్సిపాలిటీ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్దం అవుతున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ సమీక్షను మంత్రితో పాటు ఎమ్మెల్యేలు స్థానిక నేతల నేతృత్వంలో నిర్వహించారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కోసం సమాయత్తం అవుతోంది. మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్‌అలీ నేతృత్వంలోరెండు జిల్లా లో వేర్వేరు గా  పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది.ఇప్పటికే బీజేపీ సైతం కేంద్ర మాజీ మంత్రి దత్తత్య్రేయ తో పాటు పలువురు నేతల సమక్షం లో పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ సమావేశాల్లో ఆశావహులు తమ నేతల మదిల పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

No comments:

Post a Comment