Breaking News

16/07/2019

పార్లమెంట్ కు తప్పనిసరిగా హాజరు కావాలి

న్యూఢిల్లీ, జూలై 16, (way2newstv.in)
పలువురు కేంద్ర మంత్రులపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో రోస్టర్ డ్యూటీకి అనుగుణంగా కొందరు మంత్రులు వ్యవహరించడం లేదని ఆయన అన్నారు. వారివారి శాఖలపై కూడా పట్టు సాధించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు సరిగా హాజరుకాని మంత్రుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ బాధ్యతను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాల్లో ఎంపీలు పని చేయాలని చెప్పారు. అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరిగింది. 
పార్లమెంట్ కు తప్పనిసరిగా హాజరు కావాలి

పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశానికి తప్పకుండా రావాలని ఒకరోజు ముందే బీజేపీ ఎంపీలకు పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీచేసింది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురాబోయే కీలకమైన బిల్లులకు సంబంధించి ఈ సమావేశంలో ప్రధానమంత్రి మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇతర నాయకులు వివరించారు.బీజేపీ ఎంపీలు వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుండాలని ప్రధాని మోడీ సూచించారు. బీజేపీ ఎంపీలుగా గెలిచినవారిలో ఎక్కువమంది కొత్తవాళ్లే ఉన్నారని…. ప్రజల అభిప్రాయాలకు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీలు హాజరుకావాల్సిందే అని.. ఎవ్వరుకూడా డుమ్మా కొట్టకూడదని సూచించారు. పార్లమెంట్ సమావేశాల గైర్హాజరును పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని చెప్పారు.కేంద్రం పథకాలు మారుమూల పల్లెలకు చేరేలా ఎంపీలే బాధ్యత తీసుకోవాలని సూచించారు.సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి మీడియాకు వివరించారు

No comments:

Post a Comment