Breaking News

16/07/2019

సాయి నామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

హైదరాబాద్,  జూలై 16, (way2newstv.in)
మంగళవారం నాడు  గురు పౌర్ణమి సందర్బంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాలన్నీ సాయి నామస్మరణతో మార్మోగాయి. ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. 
సాయి నామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

గురుపూర్ణిమను పురస్కరించుకుని ఆలయాలను సర్వాంగసుందరంగా అలంకరించారు. మహారాష్ట్రలోని షిరిడీసాయిబాబాను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివచ్చారు.  వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కూడా భక్తులతో రద్దీగా మారాయి.

No comments:

Post a Comment