Breaking News

04/07/2019

ట్రైబల్ వెల్ ఫేర్ స్కూళ్లలో బాలారిష్టాలు


విజయనగరం, జూలై 4, (way2newstv.in)
గుడ్లూరు మండలంలోని పాజర్ల గ్రామం, ఎస్టీ కాలనీలో 150 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామానికి కిలో మీటరు దూరంలో కాలనీ ఉండటంతో 20 సంవత్సరాల కిందట కాలనీలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్వంలో గిరిజన పాఠశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 30 నుంచి 45 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా కూలి పనులు చేసుకుంటూ తమ పిల్లలను చదివించుకుంటున్నారు. ఉపాధ్యాయుడు ఎప్పుడు పాఠశాలకు వస్తాడో ఎప్పుడు రాడో కూడా తెలియదని ఇక్కడి కాలనీ వాసులు చెబుతున్నారు.

 ట్రైబల్ వెల్ ఫేర్ స్కూళ్లలో బాలారిష్టాలు

గత సంవత్సరం కూడా రెండు నెలలు వరకు పాఠశాలను తెరవక పోవడంతో కొంత మంది తల్లిదండ్రులు 3, 4, 5 తరగతులు చదువుతున్న 15 మంది పిల్లలను 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న పోట్లూరులోని యూపీ పాఠశాలకు ఆటోలో పంపుతున్నారు.  1, 2 తరగతులు చదువుతున్న మిగతా 30 మంది చిన్నారులు ఇళ్ళ వద్దే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా పాఠశాలలు తెరిచి 20 రోజులు అయినా కాలనీలో ఉన్న పాఠశాల ఇప్పటి వరకు తెరుచుకోలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.అయితే గత నాలుగు సంవత్సరాలుగా పాఠశాల సక్రమంగా నడవడం లేదు. ఇక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయుడు సకాలంలో పాఠశాలకు వచ్చే వ్యక్తి కాదు. కాలనీ వాసులు రెండు సంవత్సరాలు క్రితం ఉన్నాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతని స్థానంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారులు మహిళా ఉపాధ్యాయురాలును నియమించారు. ఆమె ఒక సంవత్సరం పాటు బాగానే చెప్పారు. ఆమె బదిలిపై వెళ్లడంతో రెండు సంవత్సరాలు నుంచి వస్తున్న ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు రాకపోవడం వల్ల విద్యార్థులకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు.తమ పిల్లలను బాగా చదివించుకోవాలని ఆశ ఉన్నా ఉపాధ్యాయుడు రాక పోవడంతో నిస్సహాయంగా ఉండాల్చిన పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలలకు పంపలేని పరిస్థితి తమదని వారు వాపోయారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఉపాధ్యాయుడు పాఠశాలకు సక్రమంగా రావడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఈ పాఠశాల గురించి ప్రజాప్రతినిధులు కాని అధికారులు గాని పట్టించుకోవడం లేదన్నారు.  ఇప్పటికైనా అధికారులు తమ గోడును ఆలకించి పాఠశాలను తెరిచి ఉపాధ్యాయుడు ప్రతి రోజు పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.పాఠశాలను సక్రమంగా నడపక పోవడంపై గత సంవత్సరం నుంచి ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని మండల విద్యాశాఖాధికారి కల్లయ్య తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు పాఠశాలను తెరవలేదని సమాచారం అందించాం. దీనిపై డీఈఓకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

No comments:

Post a Comment