Breaking News

09/07/2019

నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ `మ‌న్మ‌థుడు 2` షూటింగ్ పూర్తి.. ఆగ‌స్ట్ 9న గ్రాండ్ రిలీజ్‌

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ `మ‌న్మ‌థుడు 2` షూటింగ్ పూర్తి.. ఆగ‌స్ట్ 9న గ్రాండ్ రిలీజ్‌

ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.  చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుద‌ల‌ను త్వ‌ర‌లోనే నిర్వ‌హించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. మంగ‌ళవారం ఈ సినిమాలో అవంతిక పాత్ర‌లో న‌టించిన ర‌కుల్ ప్రీత్ క్యారెక్ట‌ర్‌ను ప్రోమో రూపంలో రిలీజ్‌ చేశారు. న‌టీన‌టులు: కింగ్ నాగార్జున‌ ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ల‌క్ష్మి వెన్నెల‌కిషోర్‌ రావు ర‌మేష్‌ ఝాన్సీ  దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

No comments:

Post a Comment