Breaking News

17/06/2019

జగన్‌ నివాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌


అమరావతి జూన్ 17 (way2newstv.in)
విజయవాడ తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. 


జగన్‌ నివాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌
ఇరువురు సీఎంలు భోజనం చేసిన అనంతరం విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై చర్చించనున్నారు. 9, 10వ షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్‌ ఉద్యోగుల విభజన, పెండింగ్‌ బిల్లులు, ఇరు రాష్ర్టాల మధ్య నీటి వివాదాల పరిష్కారంపై చర్చించనున్నారు.

No comments:

Post a Comment