కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతు న్న ఒక్క రూపాయికి అంతిమయాత్ర కార్యక్రమాన్ని నగర మేయర్ రవీందర్సింగ్ ప్రారంభించారు. కరీంనగర్లోని కట్టరాంపూర్కు చెందిన మంచాల లలిత మరణించగా ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహించారు. రూపాయి చెల్లింపు రశీదు అందించి.. పాడె కట్టడం నుంచి డప్పు చప్పు ళ్లు, అంతిమయాత్ర, దహన సంస్కారాల వర కు అన్ని సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం పూర్తిగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టారు. మృతురాలి పాడెను మేయర్ రవీందర్సింగ్ మోసి కార్యక్రమాన్ని ప్రారంభించా రు.
ఒక్క రూపాయికి అంతిమయాత్ర ప్రారంభం
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. దహన సంస్కారాలు నిర్వహించడం దైవ కార్యమన్నారు. ఈ కార్యక్రమం కోసం బల్దియా నుంచి రూ.1.50 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. నగరంలోని అన్ని మతాలు, కులాల్లో చనిపోయిన వారికి ఈ కార్యక్రమం కింద అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య విభాగం సూపర్వైజర్ వేణుగోపాల్, నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment