Breaking News

20/06/2019

వాహనదారులకు కేంద్రం బంపరాఫర్!


న్యూఢిల్లీ  జూన్ 20, (way2newstv.in)
మోదీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) అధిక ప్రాధాన్యమిస్తోంది. 2030 నుంచి అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలనే విక్రయించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతోంది. అందులో భాగంగానే సరికొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వినియోగాన్ని పెంచేందుకు అద్భుతమైన ప్రతిపాదన చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా చేయాలని భావిస్తోంది. 


వాహనదారులకు కేంద్రం బంపరాఫర్!
కేంద్రం బుధవారం విడుదల చేసిన ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించి మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలి అనుకుంటే 30 రోజులలోగా ఇవ్వొచ్చు. దీని ప్రకారం బ్యాటరీ సాయంతో నడిచే వెహికల్స్‌కు రిజిస్ట్రేషన్ చార్జీలు ఉండవు. ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేస్తారు. టూవీలర్ సహా అన్ని ఈవీలకు ఇదే వర్తిస్తుంది.

No comments:

Post a Comment