మెదక్, మే 14, (way2newstv.in)
మెదక్ ప్రజలు సేదదీరేందుకు పట్టణంలో ఒక్క పార్కు కూడా లేదు. 2016లో ప్రారంభమైన పనులు ఇంకా ఆగుతూ.. సాగుతూనే ఉన్నాయి. అప్పటి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి 2016లో మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపనచేశారు. పనుల్లో భాగంగా రెండు చెరువు కట్టలను 40 అడుగులకు విస్తరించారు. ఇప్పటి వరకు కట్టపై మట్టిపోసి బలోపేతం చేశారు.మూడేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. త్వరగా పనులు పూర్తి చేసి అందరికీ ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. గోసముద్రం చెరువుకు సంబంధించి మూడు తూములను, పిట్లం చెరువు నుంచి ఒక తూమును తొలగించి అధునాతన పద్ధతిలో పిట్లం చెరువు వద్ద రిట్నరింగ్ గోడను నిర్మించారు. దీంతో ప్రజలు ఆహ్లాదానికి, అనుభూతికి నోచుకోవడం లేదు.
నాలుగేళ్ల నుంచి సాగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులు
ఇలాంటి పరిస్థితుల్లో పట్టణంలోని గోసముద్రంను మినీ ట్యాంక్బండ్గా చేస్తున్నారని తెలిసి ప్రజలు సంతోషించారు. ఈ పనులు చేపట్టేందుకు రెండు నెలలు పట్టింది. చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు జరుగుతుండగా పూడికతీత పనులు ఇప్పటివరకు చేపట్టలేదు. చెరువు కట్టపై పార్క్ ఏర్పాటు, సీసీ పనులు మిగిలి ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే రూ 4.48 కోట్ల నిధులు మంజూరు చేయించగా మరో రూ. 2 కోట్లు మంజూరు చేయించి మిగతా పనులు చేయిస్తామని పలుమార్లు తెలిపారు. ఇప్పటివరకు మంజూరైన నిధులతో పనులు పూర్తిచేశామని, అదనపు నిధులు మంజూరు కాగానే బ్యూటిఫికేషన్ ఇతర పనులు ప్రారంభించనున్నట్లు ఇరిగేషన్ ఏఈ నాగరాజు తెలిపారు. ఇదిలా ఉంటే చెరువు కట్ట అభివృద్ధి పనుల్లో భాగంగా నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు.ఏవో కారణాలతో కొంతకాలం కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. పెద్ద చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు కట్టకు ఇరువైపులా రెండు అలుగులు నిర్మించారు. పెద్దతూం, మిర్రతూంలను కొత్తగా నిర్మించారు. అలుగుపై కట్టపై రెండు వైపుల సీసీతో దిమ్మెను వేశారు. దీంతోపాటు కట్టపైకి వాహనాలు వెళ్లేందుకు సీసీ రోడ్డును ఏర్పాటు చేశారు. రెండు కల్వర్టులు, రెండు బతుకమ్మ ఘాట్లతోపాటు కట్టపైకి ఎక్కేందుకు మెట్లు నిర్మించారు. అలుగుపై నుంచి వాహనాలు వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జ్ నిర్మించి రెండు వైపులా పైప్లు అమర్చారు. కానీ ఇంకా బ్రిడ్జ్ వద్ద మట్టిని పూర్తిస్థాయిలో పోయలేదు.
No comments:
Post a Comment