Breaking News

01/05/2019

మోడీ హయంలో రెట్టింపైన విదేశీ నిధులు

న్యూఢిల్లీ, మే 1, (way2newstv.in
ప్రధాని నరేంద్ర మోదీ తన దౌత్య నీతితో ప్రపంచపటంలో భారతదేశ కీర్తిని ఇనుమడింపజేశారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలిపారు’.. ఇది ఆయన పార్టీ చెబుతున్న మాట. మోదీ తన ఐదేళ్ల పాలనా కాలంలో 57 దేశాల్లో 97 సార్లు పర్యటించారు. ఈ పర్యటనల వల్ల మోదీ నిజంగా ఏం సాధించారు? దేశంలో రైతులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే.. మోదీ వీరిని పట్టించుకోకుండా విదేశాల్లో తిరుగుతున్నారని ప్రతిపక్షాలు ప్రత్యక్షంగానే మోదీని విమర్శించాయి. ప్రజల సమస్యలను మోదీ విస్మరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలాసార్లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలను పక్కన ఉంచితే మోదీ విదేశీ పర్యటనల వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం కలిగిందో ఒకసారి చూద్దాం.. మోదీ హయంలో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏకంగా 193 బిలియన్ డాలర్లు. 


మోడీ హయంలో రెట్టింపైన విదేశీ నిధులు

మన్మోహన్ సింగ్ హయంలో చివరి ఐదేళ్ల కాలంలోని ఎఫ్‌డీఐ ఇన్వెస్ట్‌మెంట్లతో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 50 శాతం ఎక్కువ. వివిధ దేశాల నుంచి భారీ ఇన్వెస్ట్‌మెంట్ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇందులో చైనా కీలకం. భారత్‌లో భారీ ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టేందుకు ఈ దేశం అంగీకారం తెలిపింది. మోదీ హయంలోనే భారత్ తొలిసారిగా అమెరికా నుంచి ముడిచమురు, నేచురల్ గ్యాస్‌ను కొనుగోలు చేయడం ప్రారంభించింది. రష్యా నుంచి మధ్యప్రాశ్చ ప్రాంతం వరకు వివిధ దేశాలతో క్రూడ్ ఆయిల్‌కు సంబంధించి డీల్స్ కుదుర్చుకున్నారు. దీంతో దేశానికి ఇంధన భధ్రతను చేకూర్చారు. మన దేశం ముడిచమురు ఆధారిత దేశం. అదేసమయంలో ప్రపంచంలోనే అదిపెద్ద క్రూడాయిల్ ఎగుమతిదారైన సౌదీ ఆరామ్‌కో.. భారత్‌లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. గల్ఫ్ దేశాలతో సంబంధాలను కొనసాగించారు. ఇరాన్‌తో బంధాలను బలోపేతం చేశారు. అయితే టెహ్రాన్‌పై అమెరికా ఒత్తిడి నేపథ్యంలో ఇరాన్ నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్ నిరంతంరం పొందడంలో మోదీ విఫలమయ్యారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇజ్రయెల్‌లో తొలిసారి పర్యటించిన భారత్ ప్రధానిగా పేరొందిన మోదీ.. ఆ దేశం నుంచి డీల్స్ రూపంలో అడ్వాన్స్‌డ్ డిఫెన్స్, వాటర్ టెక్నాలజీ పొందారు. జపాన్‌తో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చకున్నారు. 2016లో 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో డీల్ కుదుర్చుకున్నారు. ఈ డీల్‌తో దేశంలో రాజకీయ దుమారం చెలరేగింది. ఇకపోతే మోదీ కొన్ని పర్యటనల వల్ల ఎలాంటి లాభం చేకూరలేదు. 2015లో పాక్ పర్యటన ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు

No comments:

Post a Comment