Breaking News

01/05/2019

యాదాద్రి జిల్లా రోడ్డు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

యాదాద్రి భవనగిరి, మే 1,  (way2newstv.in)
జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసిరెడ్డిపల్లిలో కారు బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. హైదరాబాద్ చంపాపేటకు చెందిన ఐదుగురు విద్యార్థులు మంగళవారం రాత్రి ఓ వేడుకకు హాజరయ్యారు. అనంతరం నగరానికి తిరిగి వస్తుండగా మైసిరెడ్డిపల్లి వద్దకు రాగానే కారు బోల్తా పడింది. 


 యాదాద్రి జిల్లా రోడ్డు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

ఈ ప్రమాదంలో స్ఫూర్తి (22), ప్రణీత (22), చైతన్య (23) అక్కడికక్కడే మృతి చెందగా.. వినీత్రెడ్డి (23) చికిత్స పొందుతూ మృతి చెందాడు.  మానీష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం సేవించి కారు నడపడమే కాకుండా అతి వేగం కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.  మైసిరెడ్డి గ్రామ శివారులో బొమ్మల రామారం నుండి నాగినేని పాల్లి వెళ్లే మార్గం లో మూల మలుపు దగ్గర హోండా ఆక్సన్ట్ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పడినట్లు పోలీసులు నిర్ధారించారు. విద్యార్ధులంతా ఇబ్రహీంపట్నం శ్రీ ఇందూ  కళాశాలకు చెందిన వారు.  వీరంతా బొమ్మల రామారం లోని పెట్రోల్ బంకు ఆవరణలో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ లో జరిగిన పార్టీలో పాల్గోన్నారు. 

No comments:

Post a Comment