జగిత్యాల ఏప్రిల్ 25 (way2newstv.in)
ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరాపార్కు తలపెట్టిన అంబేద్కర్ వాదుల సభను జయపద్రం చేయాలని ఎమ్మార్పీఎస్ జగిత్యాల మండల ఇంచార్జి నక్క సతీష్ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో చలో హైదరాబాద్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల13న హైదరాబాద్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం కూల్చివేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ లో 27తేదీన తలపెట్టిన మహా గర్జన సభను అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున సభకు తరలి వచ్చిజయపద్రం చేయాలని కోరారు . అలాగే అంబేద్కర్ వాదులు ప్రజా సంఘాలు ఎమ్మార్పీఎస్,వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు .ఈ కార్యక్రమంలో టీ మార్స్ జిల్లా అధ్యక్షులు నక్క విజయ్ కుమార్, న్యాతర్ల శ్రీనివాస్ నక్క రవీందర్ ,అశోక్ ,శేఖర్, శ్యాం ,హరీష్ ,సంపత్, గణేష్ ,హన్మంత్ ,విజయ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment