Breaking News

09/04/2019

నిలిచి ఉన్న రైలు లోంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు

హైదరాబాద్‌ ఏప్రిల్ 9 (way2newstv.in)  
 హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌ లో నిలిచి ఉన్న రైలు లోంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు చేలరేగాయి. దాంతో  ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బంది ఆందోళనకు గురైనారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్‌ 6లో నిలిచి ఉన్న చార్మినార్‌ ఎక్స్‌ ప్రెస్‌ లో ఈ ఘటన జరిగింది. 


నిలిచి ఉన్న రైలు లోంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు

అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కావడం.. ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

No comments:

Post a Comment