రైతుల ఐక్యత సభలో నినదించిన రైతు సంఘం నాయకులు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ రైతులు పోటీ చేయాలని పిలుపు
నిజామాబాద్ (ఆర్మూర్) ఏప్రిల్ 9 (way2newstv.in)
పసుపు బోర్డు ఏర్పాటు సహా పసుపు పంట క్వింటాల్ ధర రూ.10 వేలకు పెంచకపోతే ఓట్లు అడగనని గతంలో పేర్కొన్న ఎంపీ కవిత ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయిందని అలాంటప్పుడు ఆమెకు ఎందుకు ఓటు వేయాలని పలువురు రైతు సంఘ నాయకులు నినదించారు. ఆర్మూర్లో మంగళవారం రైతు ఐక్యత సభ నిర్వహించారు.ఈ సభకు పెద్ద ఎత్తున రైతులు హాజరైనారు.రాష్ట్ర కిసాన్ కేత్ అధ్యక్షుడు అన్వేష్రెడ్డి అన్నారు. ఇంకా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయని నేపథ్యంలో ఆమెను ప్రశ్నిస్తే అది తన పరిధిలో లేదని తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటప్పుడు తెరాస తరఫున నిలబడుతున్న కవితకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు.
కవితకు ఎందుకు ఓట్లు వేయాలి?
ఈ అంశంపై భాజపా కూడా నోరు విప్పడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రైతు సమస్యల పోరాటంలో భాగంగా కర్షకులంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ఉద్యమాన్ని కించపర్చే వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నిజామాబాద్ లోక్సభ బరిలో ఉన్న రైతు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఈ సభ జరిగింది. కార్యక్రమానికి ప్రొఫెసర్ నాగేశ్వర్, న్యాయవాది రచనారెడ్డి, నామినేషన్లు దాఖలు చేసిన రైతు ఎంపీ అభ్యర్థులు, పెద్దఎత్తున ఎర్రజొన్న, పసుపు రైతులు తరలివచ్చారు.‘నామినేషన్లు వేసిన రైతులంతా కడుపు మండి ఈ పని చేయడంలేదు.. ఏదో ఓ పార్టీ వారి వెనక ఉండి ఈ పని చేయిస్తోంది’ అని కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. కేటీఆర్, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రైతులు ముక్త కంఠంతో ఖండించారు. స్పైస్ బోర్డు నెలకొల్పామని కేటీఆర్ చెప్తున్నారని, కేవలం స్పైస్ పార్కు పెట్టి దాన్ని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. పార్టీలను పక్కన పెట్టి రైతులంతా ఏకమై సమస్యలను పరిష్కరించుకుందామని రాష్ట్ర కిసాన్ కేత్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ రైతులు అధిక సంఖ్యలో పోటీ చేయాలని దిశానిర్దేశం చేశారు.
No comments:
Post a Comment