Breaking News

30/04/2019

నిందితుడి ఇంటిని తగులబెట్టిన గ్రామస్థులు

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 30 (way2newstv.in)
జిల్లాలోని బొమ్మలరామారం మండలం హాజిపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శ్రావణి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాస్రెడ్డి ఇంటిపై గ్రామ ప్రజలు దాడి చేసి నిప్పంటించారు. గత వారంలో వెలుగులోకి వచ్చిన 9వ తరగతి విద్యార్థిని శ్రావణి హత్య కేసు తర్వాత నిన్న మరో యువతిని కూడా మర్డర్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది.  


నిందితుడి ఇంటిని తగులబెట్టిన గ్రామస్థులు

హాజీపూర్ లో శ్రావణి శవం దొరికిన బావిలోనే మనీషా అనే డిగ్రీ విద్యార్థిని డెడ్ బాడీ కూడా బయటపడింది.  ఈ హత్యలన్నింటికీ మర్రి శ్రీనివాస్ అనే వ్యక్తే కారణమని భావిస్తున్నారు.  అతను ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు. శ్రీనివాస్రెడ్డి కుటుంబం పరారీలో ఉంది. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిందితుడి ఇంటి మీద దాడి జరగడం, ఇంటికి నిప్పు పెట్టడం జరిగింది.  పోలీసులు గ్రామ ప్రజలను అడ్డుకున్నారు. శ్రీనివాస్ ను ఎన్ కౌంటర్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.  తమ పిల్లలను బయటకు పంపాలంటేనే భయమేస్తుందని చెబుతున్నారు  గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 

No comments:

Post a Comment