Breaking News

30/04/2019

ఆస్తి కోసం సవతి తల్లిని దారుణంగా చంపిన కానిస్టేబుల్

హైదరాబాద్. ఏప్రిల్ 30 (way2newstv.in
తండ్రి చనిపోయి రెండు నెలలు గడవక ముందే ఆస్తి కోసం సవతి తల్లిని అతి దారుణంగా చంపాడోక పోలీసు కానిస్టెబులల్. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయబస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాదన్నపేట్ కు చెందిన యాదయ్య కు ఇద్దరు భార్యలు. ఈ మధ్య కాలంలో నే యాదయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. పెద్ద భార్య కోడుకు శ్రీకాంత్ పోలీసు జవానుగా ఉద్యోగం చేస్తున్నాడు.


ఆస్తి కోసం సవతి తల్లిని దారుణంగా చంపిన కానిస్టేబుల్

తండ్రీ దహన కార్యక్రమంలో కూడా శ్రీకాంత్ ఆస్తి కోసం గొడవ పడ్డాడు. విషయం తెలిసిన స్థానిక పోలీసులు వచ్చి సముదాయించారు. బతికి ఉన్నపుడే తండ్రి శ్రీకాంత్ కు బీహెచ్ ఈఎల్  టౌన్ షిప్ లో కోటి రూపాయల విలువ చేసే ఇల్లు,మాదన్నపేటలో మరో ఇల్లు ఇచ్చాడు. అదిగాక,  తండ్రి రెండో భార్య కు ఇచ్చిన ఆస్తి తనకే కావాలని మంగళ వారం ఉదయం మాదన్నపేట్ లో ఉండే సవతి తల్లి ఇంటికి వచ్చి ఘర్షణకు దిగాడు. అవేశంతో ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లల కళ్లల్లో కారం చల్లి సవతి తల్లి సుకన్య మెడను కోసి అతి దారుణంగా చంపాడు. 

No comments:

Post a Comment