Breaking News

01/04/2019

లోకేశ్ టార్గెట్‌గా.. పీకే టీం పక్కా వ్యూహం!

మంగళగిరి ఏప్రిల్ 1 (way2newstv.in)  
మంగళగిరిపై పీకే టీం వాలిపోయింది. వీవీఐపీ నియోజకవర్గంగా మంగళగిరి మారడంతో మంగళగిరి బరిలో అమీ తుమీ తేల్చుకోవాలని వైసీపీ నిర్ణయించింది. 200 మంది సభ్యుల బృందం మంగళగిరిలో మకాం వేయడం.. కులాలవారీగా ఏర్పాటు చేస్తున్న సమావేశాలపై టీడీపీ కన్నేసింది. జగన్ సోదరి షర్మిల మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.


లోకేశ్ టార్గెట్‌గా.. పీకే టీం పక్కా వ్యూహం! 

లోకేశ్‌ను ఓడించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పీకే టీమ్ వ్యూహం రచించింది. దీనిలో భాగంగానే తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో.. వైసీపీ జెండాలతో ఉన్న వాహనాలు మంగళగిరిలో చెక్కర్లు కొడుతున్నాయి. వీరంతా ఇంటిటికీ తిరిగి ఆధార్, బ్యాంక్ అకౌంట్లు సేకరించి ఆ సమాచారాన్ని ట్యాబ్‌ల్లో నిక్షిప్తం చేసి వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపుతున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment