Breaking News

13/04/2019

రాజన్న సన్నిధీలో రాములోరి కళ్యాణం

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 13  (way2newstv.in)
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో  అంగ రంగ  వైభవంగా  శ్రీ సీతా రాముల వారి కళ్యాణం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని పూర్తి ఏర్పాట్లు చేశారు. 


రాజన్న సన్నిధీలో రాములోరి కళ్యాణం

ప్రధానంగా రాజేశ్వర స్వామి ఆలయం శివ క్షేత్రం.ఇందులో భాగంగా హరిహరుల క్షేత్రంగా పేరుగాంచిన రాజేశ్వర స్వామి ఆలయంలో  అనాదిగా వైష్ణవ సంప్రదాయంలోని శ్రీ సీత రాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు  చలువపందిళ్లు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా   బారికేడ్లు కట్టారు. వేములవాడ లో సీత రాముల కల్యాణానికి ప్రత్యేకతగా ప్రధానంగా జోగినిలు రావటం వాళ్లు శ్రీ రాముల వారి కళ్యాణం ఎదుట పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. జోగినీలు ఈ ఆలయానికి వచ్చి కల్యాణం చేసుకుంటారు.

No comments:

Post a Comment