Breaking News

03/04/2019

డీకే ఆరుణను ప్రజలు నమ్మరు

భూత్పూర్, ఏప్రిల్ 03 (way2newstv.in
మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూత్పూర్ మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో జనసంద్రమైనది. యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ  బైక్ ర్యాలీ తో స్వాగతం పలికారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిధిగా  హాజరైన మాజీ కేంద్ర మంత్రి  ఎస్ . జైపాల్ రెడ్డి,   పార్లమెంట్ అభ్యర్తి చల్లా వంశీ చంద్ రెడ్డి,  పీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ గౌడ్ ఇతర నేతలు హజరయ్యారు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసారు.  


డీకే ఆరుణను ప్రజలు నమ్మరు

పాలమూరు జిల్లా అభివృద్ధికి తాను గతంలోనే ఎంతో కృషి చేశానని, కేంద్రం నుంచి ఎన్నో నిధులు మంజూరు చేయించానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసినట్లు ఆయన తెలిపారు. ఈరోజు రాష్ట్రం సాధించుకున్నామంటే సోనియమ్మ చొరవేనని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం బంగారుమయం అవుతుందనుకున్న ప్రజలకు కేసీఆర్ మొండిచెయ్యి చూపించారని విమర్శించారు. పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి డీకే అరుణ పార్టీని వీడి భాజాపా తరుపున పోటీ చేస్తుందన్నారు. ప్రజలు ఆమెను నమ్మే పరిస్థితి లేదన్నారు. తనను గెలిపిస్తే పాలమూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గ నేతలు ప్రదీప్ కుమార్ గౌడ్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment