Breaking News

27/04/2019

త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల

న్యూ డిల్లీ ఏప్రిల్ 27 (way2newstv.in
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. మహాత్మా గాంధీ సిరీస్‌లో ఈ నోట్లు ఆకుపచ్చ, పసుపు కలగలిసిన రంగులో ఉండనున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.  ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకం ఉండే ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంటుంది. 


త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల

దీంతోపాటు అశోకుడి స్థూపం కూడా ఉంటుంది. ఇక నోటు వెనకభాగంగంలో ఎల్లోరా గుహల చిత్రంతోపాటు స్వచ్ఛ భారత్‌ లోగో, నినాదం ఉంటాయి. కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. కొత్త నోటుకు సంబంధించి నమూనాను ఆర్బీఐ విడుదల చేసింది. ఇప్పటికే రూ.10, రూ.100 విలువచేసే కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త రూ.20 నోటుతో పాటు పాత నోట్లు కూడా చెల్లుతాయని, దీనిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

No comments:

Post a Comment