తృటిలో తప్పిన ప్రమాదం
అనంతపురం, ఏప్రిల్ 27 (way2newstv.in)
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ప్రధాన గేటు వద్ద హోటల్ నిర్వహిస్తున్న నాయక్ ఇంట్లోకి రోడ్డుపై వెళ్తున్న లారీ దూసుకెళ్లింది. ఇంటి ముందర మురికి కాలువ ఉండటంతో లారీ టైర్లు అందులో దిగుబడి ముందుకెళ్లలేదు.
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
ఇంటి ముందర వరండా కోసం నాటిన నల్లబండలుకు ఢీ కొనడంతో నాలుగు బండలు పగిలాయి. లోపల హోటల్ పని చేసుకుంటున్న నలుగురు సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. లారీ డ్రైవెర్, ఓనర్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
No comments:
Post a Comment