హైదరాబాద్, మార్చ్ 12 (way2newstv.in)
మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగనున్నారు. గత మూడు రోజులుగా ఆమె టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ భారీగా ప్రచారం జరిగింది. కేటీఆర్, కవితతో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ తో సబిత, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి భేటీ కావడంతో వాళ్లిద్దరూ టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు సాగాయి. దీనికి తోడు సబిత వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆమె తన కుమారుడితో కలిసి టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైపోయిందని అంతా అనుకున్నారు. అయితే, ఆమె పార్టీ మారకుండా రేవంత్ రెడ్డి చేసిన రాయబారం ఫలించింది.
రంగంలోకి రేవంత్.. కాంగ్రెస సబితాఇంద్రారెడ్డి?
సబితతో రేవంత్ మాట్లాడటంతో ఆమె మనసు మార్చుకున్నట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ లోనే కొనసాగితే ఎలా ఉంటుందనే ఆలోచనకు సబిత వచ్చినట్టు తెలుస్తోంది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ లో ఇమడలేక బయటకు వచ్చేశారని.. టీఆర్ఎ చేరాక ఆయనకు ఎదురైన పరిస్థితులు, మీకూ ఎదురైతే ఏం చేస్తారంటూ సబితకు రేవంత్ నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. మంగళవారం సబిత మీడియాతో మాట్లాడారు. టికెట్ విషయంలో తమ కుటుంబానికి అన్యాయం చేశారని విమర్శించారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తనపై వ్యాఖ్యలు చేస్తున్నా పీసీసీ స్పందించకపోవడం బాధించిందని ఆమె అన్నారు. ఇటీవల జరిగిన రాహుల్ సభ విషయంలో తన కుమారుడు కార్తీక్ రెడ్డిని పట్టించుకోలేదని సబిత ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని కావాలనే అణగదొక్కుతున్నారన్నారు. తాము వెళ్లిపోతే పార్టీకి నష్టం అనే వేచిచూస్తున్నామని ఆమె అన్నారు.
No comments:
Post a Comment