నల్గోండ, మార్చి 6, (way2newstv.in)
నల్లగొండ జిల్లా లో జరిగిన ఘోర రొడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో పదిహేను మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి దేవరకొండ వైపు వస్తున్న బొలెరో వాహనం హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవేపై కొండమల్లెపల్లి మండలం చెన్నారం వద్దకు రాగానే టైర్ పగిలిపోయింది.
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
దాంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న ఏడుగురుమరణించారు. గాయాపడిన వారందరై బస్సు ప్రయాణికులు. దేవరకొండ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుంది. క్షతగాత్రులో కొంతమంది పరిస్థితి విషమంగా వుంది.
No comments:
Post a Comment