న్యూఢిల్లీ, మార్చి 1 (way2newstv.in)
ఓ వైపు భారత్- పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతుంటే, మరోవైపు దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి చేసిన కుట్రలను నిఘా సంస్థలు భగ్నం చేశాయి. ఢిల్లీలోని 29 ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. దీంతో పోలీసులతో పాటు ఆర్మీ అనేకు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది.
దేశంలో అలజడి కి ఉగ్రవాదుల ప్రయత్నాలు
ఉగ్రవాదులు మెట్రో స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెలుగులోకి రావడంతో నగరంలోని అనేక మెట్రో స్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, సరోజ్ నగర్, సదర్ బజార్ మెట్రో స్టేషన్లలో భద్రతా బలగాలు అణువణువూ తనిఖీ చేస్తున్నాయి. బాంబ్ స్వ్కాడ్స్ను కూడా రంగంలోకి దించారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రవాదులు దేశంలో దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘా సంస్థలు అంచనా వేశాయి. దీనిలో భాగంగానే ఢిల్లీ, ముంబయి మెట్రో స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మెట్రో స్టేషన్లలో పారా మిలటరీ బలగాలతో పహారా కాస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
No comments:
Post a Comment