Breaking News

14/02/2019

ఈ సమ్మర్ హాట్ గురూ.

హైద్రాబాద్, ఫిబ్రవరి 14, (way2newstv.in)
చలికాలం వెళ్లిపోతోంది. ఎండలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉంటుండగా, తెల్లవారుజామున మాత్రమే కాస్తంత చలి అనిపిస్తోంది. ఈ చలి కూడా మరో వారం పదిరోజుల్లో మాయమవుతుంది. ఆపై ఎండాకాలం మొదలు.
ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే  మించిన ఎండలు కాస్తాయట. ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 


ఈ సమ్మర్ హాట్ గురూ.

రాబోయేది మామూలు వేసవి కాలం కాదని, గత రికార్డులను అధిగమించే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అభిప్రాయపడుతున్నారు. తేమ గాలులు వీచే అవకాశాలు లేకపోవడమే ఇందుకు కారణమని, అల్ప పీడనాలు లేక, మబ్బులు కనిపించక సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుందని చెబుతున్నారు.దేశంలోని ఎన్నో ప్రాంతాలు 50 డిగ్రీలను మించిన వేడిమిని చూడనున్నాయని అంటున్నారు.ఈ ఎండలపై తగు జాగ్రత్తలు తీసుకోకుంటే, ప్రాణ, పంట నష్టాలకు అవకాశం ఉంటుందని, ఎప్పటికప్పుడు వేడి తీవ్రత గురించి తెలుసుకున్న తరువాతనే బయటకు వస్తే మంచిదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ఎండలు మండిపోనున్నాయని, చిన్న చిన్న రిజర్వాయర్లలో నీరు పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. 2019 ఎండాకాలం గతంలో ఎన్నడూ చూడనంత ఉష్ణోగ్రతలను పరిచయం చేస్తుందని వాతావరణ శాస్త్రజ్ఞులు అంటున్నారు. 2016ను మించిన ఎండలు కాస్తాయని అభిప్రాయపడ్డారు. సూర్యకాంతికి ఎల్ నినోలు తోడు కానున్నాయని, వీటి ప్రభావం ప్రజలపై అధికమని వాతావరణ విభాగం అదికారులు పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment