Breaking News

13/02/2019

తెలంగాణలో జనసేన పార్టీ పోటీ

హైద్రాబాద్, ఫిబ్రవరి 13, (way2newstv.in)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేన పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోటీకి సై అంటోంది. ఏపీతోపాటు తెలంగాణలోనూ పోటీకి ఆ పార్టీ సిద్ధపడుతోంది. తెలంగాణలోని ఐదు పార్లమెంట్ కమిటీలను పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. 


తెలంగాణలో జనసేన పార్టీ పోటీ

చేవెళ్ల, నిజామాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలను జనసేన ప్రకటించింది. ఇప్పటికే సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, ఖమ్మం లోక్‌‌సభ నియోజకవర్గాలకు జనసేన కమిటీలను ప్రకటించింది. మెదక్, నల్లగొండ, భువనగిరి, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలను జనసేనాని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు పరోక్షంగా మద్దతు ప్రకటించిన పవన్.. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలుపుతుండటం ఆసక్తి కలిగిస్తోంది. యువతలో జనసేన పట్ల క్రేజ్ ఉన్న నేపథ్యంలో.. ప్రతి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ గణనీయంగా ఓట్లను సాధిస్తుందని భావిస్తున్నారు. గెలుపోటములను జనసేన అభ్యర్థులు ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీలు ఒత్తిడికి లోనయ్యే ఛాన్స్ ఉంది.

No comments:

Post a Comment