Breaking News

06/02/2019

ఆ నాలుగు రోజులు పెళ్లిళ్లే...పెళ్లిళ్లు

విజయవాడ, ఫిబ్రవరి 6 (way2newstv.in)
మాఘమాసాన్ని వివాహాది శుభకార్యాలకు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అవావిహితులు మాఘమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. ఇక, గృహ ప్రవేశమైనా, వ్యాపారమైనా, ఇంటి నిర్మాణానికి శంకుస్థాపనైనా మాఘంలో నిర్వహిస్తారు. శుభ ముహూర్తాలకు నెలవైన మాఘ మాసం రాకతో నుంచి తెలుగు రాష్ట్రాల్లో వివాహాల సందడి ప్రారంభమైంది. బుధవారం నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలవుతున్నాయి. అయితే, ఫిబ్రవరి 10న శ్రీ పంచమి, 12న రథసప్తమి, 16న భీష్మ ఏకాదశి, ఆపై మార్చి 4న మహా శివరాత్రి పర్వదినాలు కూడా మాఘమాసంలో ఉన్నాయి. డిసెంబరు 30తో అంటే మార్గశిర కృష్ణపక్ష నవమితో పెళ్లిళ్లకు ముహూర్తాలు ముగిశాయి. 


 ఆ నాలుగు రోజులు పెళ్లిళ్లే...పెళ్లిళ్లు

తర్వాత పుష్యమాసం మొదలు కావడంతో దీన్ని వివాహాలు, శుభ కార్యాలకు అంత మంచిది కాదని అంటారు. మార్గశిర బహుళ నవమి నుంచి దాదాపు 35 రోజులు శుభకార్యాలకు బ్రేక్ పడింది. మంగళవారం నుంచి మాఘమాసం ఆరంభం కావడంతో తిరిగి శుభముహూర్తాల సీజన్ తిరిగి మొదలైంది. ఫిబ్రవరి 8, 9, 10, 11 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అలాగే నెలాఖరు వరకూ కూడా మంచి రోజులేనని అంటున్నారు. మరోవైపు, నగరాలు, పట్టణాల్లోని కల్యాణ మండపాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. రెండు మూడు నెలల ముందే ఫంక్స్ హాల్స్ బుకింగ్‌లు అయిపోయినట్టు తెలుస్తోంది. పురోహితులు, బాజా బజంత్రీలు, ఈవెంట్ మేనేజర్లు, క్యాటరింగ్ సంస్థలకు ఈ నెలలో మంచి గిరాకీ ఉంది. ఈ మాసంలో తొలుత వచ్చే మాఘ శుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు. వసంత పంచమి రోజున సరస్వతీ దేవి పుట్టినరోజు కావడంతో చిన్నారులతో అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈనెల 10న చదువుల తల్లి సరస్వతిదేవి పుట్టినరోజున శ్రీపంచమిగా, వసంతపంచమిగా నిర్వహిస్తారు. 12న వచ్చే రథసప్తమిని సూర్యజయంతి అంటారు. ఆదిత్య హృదయం, సూర్యాష్టకాలను పారాయణం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం ఎంతో మంచిదని పెద్దలు చెబుతారు

No comments:

Post a Comment