Breaking News

04/02/2019

హస్తీనకు వెళ్లిన సీఎం చంద్రబాబు

అమరావతి,ఫిబ్రవరి 04: (way2newstv.in):
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీజేపీయేతర పార్టీలతో కలిసి ఈసీని కలవనున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్పై ఆరోపణలు వస్తుండడంతో దీనిపై ఫిర్యాదు చేయాలని బీజేపీయేతర పార్టీలు నిర్ణయించాయి. ఇప్పటికే ఈసీకి సమర్పించేందుకు ఒక డాక్యుమెంట్ తయారు చేశారు. 



హస్తీనకు వెళ్లిన సీఎం చంద్రబాబు

ఈసీతో సమావేశం అనంతరం బీజేపీయేతర పక్షాలు మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక ర్యాలీలు నిర్వహించే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.  తరువాత  కోల్కతా పరిణామాలపై కూడా బీజేపీయేతర పార్టీలు సమావేశంలో స్పందించే అవకాశం ఉంది.

No comments:

Post a Comment