Breaking News

04/02/2019

18సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు

ఓటు హక్కును నమోదు చేయించుకోవాలి 
- మిట్టపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ 
సిద్ధిపేట, ఫిబ్రవరి 04: ( way2newstv.in)
18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రజలను కోరారు. 9వ జాతీయ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆదివారం కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాల వారీగా అధికారిక యంత్రాంగం ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు సిద్ధిపేట మండలం మిట్టపల్లి గ్రామంలో నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
 

 18సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని పోలింగ్ బూత్ వారీగా కొత్తగా ఓటు నమోదైన వారి, నమోదు చేసుకోవాల్సిన వారి యొక్క అంశాల జాబితా పై బీఎల్ఓలను కలెక్టర్ ఆరా తీశారు. గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు నమోదు చేయించేలా చూడాలని ఆదేశించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహశీల్దారు విజయ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment