Breaking News

27/07/2018

ఆసియా కప్ షెడ్యూల్ పై బీసీసీఐ అసంతృప్తి

ముంబై, జూలై 27 (way2newstv.in) 
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చేసిన ఆసియా కప్ షెడ్యూల్‌‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మండిపడుతోంది. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 15 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుండగా.. భారత్ జట్టు 18న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే.. తర్వాత రోజునే అంటే.. 19న పాకిస్థాన్‌తో భారత్ రెండో మ్యాచ్‌ ఆడేలా షెడ్యూల్ ఉండటం బీసీసీఐకి ఇప్పుడు కోపం తెప్పిస్తోంది. ఒక మ్యాచ్ ఆడిన తర్వాత.. మరుసటి రోజే ఆటగాళ్లు ఎలా మ్యాచ్ ఆడతారంటూ..? ఇప్పుడు ఘాటుగా ప్రశ్నిస్తోంది. ఆసియా కప్ షెడ్యూల్‌ని అనాలోచితంగా వేసినట్లున్నారు. కనీసం ఆటగాళ్ల విశ్రాంతిని పరిగణలోకి తీసుకోలేదు. భారత జట్టు ఈరోజు మ్యాచ్ ఆడి.. మళ్లీ మరుసటి రోజే మ్యాచ్ ఎలా ఆడుతుంది..? అదీ.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై..! ఇలాంటి షెడ్యూల్‌ని ఐసీసీ ఎలా ఆమోదించిందో అర్థంకావడం లేదు. కానీ.. మరోవైపు పాకిస్థాన్‌కి మాత్రం భారత్‌తో మ్యాచ్‌కి ముందు రెండు రోజుల విశ్రాంతి దొరుకుతోంది’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టోర్నీలో భాగంగా సెప్టెంబరు 16న తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్.. మళ్లీ 19న భారత్‌తో తలపడనుంది. షెడ్యూల్‌లో ప్రకారం భారత్‌, పాకిస్థాన్, ఒక క్వాలిఫయర్ జట్టుతో కలిసి గ్రూప్-ఎలో ఉండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ గ్రూప్-బిలో ఉన్నాయి. 



 ఆసియా కప్ షెడ్యూల్  పై బీసీసీఐ అసంతృప్తి

No comments:

Post a Comment