Breaking News

29/06/2018

కన్నాను అడ్డుకున్న టీడీపీ, సీపీఐ నేతలు

అనంతపురం, జూన్ 29 (way2newstv.in)
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  అనంతపురం జిల్లా పర్యటన ఉదృక్తతకు దారితీసింది. గుండాలతో కన్నా పర్యటన చేస్తున్నారని టీడీపీ , సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు.  అయన బస చేసిన ఆర్ అండ్ బి గెస్ట్హౌస్ వద్ద గుమిగూడి నినాదాలు చేసారు. గురువారం గెస్ట్హౌస్లో కన్నా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కార్యకర్తలు గెస్ట్హౌస్ చేరుకుని కన్నా, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోనికి దూసుకొస్తున్న టీడీపీ కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కండువాలకు బీజేపీ నేతలు నిప్పుపెట్టారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపు చేసారు. కన్నా లక్ష్మీనారాయణ పై 2వ పట్టణ పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు.  



కన్నాను అడ్డుకున్న టీడీపీ, సీపీఐ నేతలు

No comments:

Post a Comment