Breaking News

11/12/2019

జగన్ గన్నేరు పప్పు : లోకేష్ సెటైర్లు

విజయవాడ, డిసెంబర్ 11 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తెలుగులో జగన్ తప్పులు పలికారని.. లెక్కల్లో వీక్‌గా ఉన్నారంటూ ఓ వీడియోను బయటపెట్టారు. వైసీపీ పేటీఎం బ్యాచ్, నేతలు ఈ వీడియోకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తనను పప్పు అంటున్నారని.. మరి జగన్‌ను గన్నేరు పప్పు అంటారా అని సెటైర్లే పేల్చారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్‌పై విరుచుకుపడ్డారు.శాసనసభలో సభ్యుడ్ని కాకపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తన పేరును పదే, పదే ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు లోకేష్. చంద్రబాబు కంటే తన పేరును పదే,పదే ప్రస్తావించారని.. శాసనసభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదన్న సంప్రదాయం కూడా తెలియదా అన్నారు. 
 జగన్ గన్నేరు పప్పు : లోకేష్ సెటైర్లు

ఒకటికి పదిసార్లు మాట్లాడితే స్పీకర్ ఏమీ అనలేదని.. ఇందే పద్దతని మండిపడ్డారు. తాను పై చదువుల కోసం అమెరికా వెళ్లానని.. దాదాపు ఎనిమిదేళ్లు అమెరికాలో ఉన్నానని.. తెలుగులో ఒక పదం అటో ఇటో అని ఉండొచ్చు అన్నారు లోకేష్.తాను తెలుగులో తప్పులు మాట్లాడితే.. తెలుగు మాట్లాడటం రాదని పదే, పదే చెబుతున్నారని.. తాను వర్థంతిని జయంతి అనడం వల్ల ఏపీకి ఏదైనా అన్యాయం జరిగిందా అంటూ లోకేష్ ప్రశ్నించారు. తాను తెలుగు తప్పుగా మాట్లాడటం వల్ల పెట్టబడులు వెనక్కు వెళ్లాయా, పోలవరం పనులు ఆగాయా, అమరావతి ఏమైనా ఆగిందా వైఎస్సార్‌సీపీ చెప్పాలన్నారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి.. 16 నెలలు జైల్లో ఉన్న ఆయన నీతులు మాట్లాడితే వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు అన్నారు.తాను పంచాయతీరాజ్, ఐటీ మంత్రిగా కష్టపడి పనిచేశాను అన్నారు లోకేష్. రాష్ట్రానికి ఎన్నో నిధులు తీసుకొచ్చామని.. 25వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెప్పారు. మరుగుదొడ్లు కట్టాం గ్రామాలు అభివృద్ధి చేశామని చెప్పారు. తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాలుగు శాఖలకు 53 అవార్డులు వచ్చాయన్నారు. ఇక 2014 మహానాడులో కార్యకర్తల్ని ఆదుకోవాలనే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాను అన్నారు లోకేష్. దీనిని అందరూ ఆమోదించారని.. టీడీపీ సభ్యత్వం ఎవరూ తీసుకున్నా.. 2 లక్షల ప్రమాద భీమా ఇస్తున్న పార్టీ తమది మాత్రమే అన్నారు.

No comments:

Post a Comment