Breaking News

02/12/2019

మరింత తగ్గిన బంగారం ధర

ముంబై, డిసెంబర్ 2 (way2newstv.in)
పసిడి ధర దిగొచ్చింది. బంగారం ధర గత నెల రోజుల్లో ఏకంగా రూ.600కు పైగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో నవంబర్ 2న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.40,410 వద్ద ఉంది. ఇప్పుడు బంగారం ధర రూ.39,770కు దిగొచ్చింది. అంటే పసిడి ధర నెల రోజుల వ్యవధిలో రూ.640 క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.590 పడిపోయింది. నవంబర్ 2న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.37,050 వద్ద ఉంది. ఇప్పుడు ఈ ధర రూ.36,460కు తగ్గింది. నెల రోజుల వ్యవధిలో పసిడి రూ.590 క్షీణించింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది.
మరింత తగ్గిన బంగారం ధర

వెండి పతనబంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర కేజీని నవంబర్ 1న రూ.48,500 వద్ద ఉంది. ఇప్పుడు వెండి ధర రూ.46,650 వద్ద కొనసాగుతోంది. నెల రోజుల్లోనే వెండి ధర ఏకంగా రూ.1850 పడిపోయింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరిస్థితి ఇలానే ఉంది. నెల రోజుల వ్యవధిలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పడిపోయింది. నవంబర్ 2న పసిడి ధర రూ.39,050 వద్ద ఉంది. ఇప్పుడు ఈ ధర రూ.38,400కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.37,850 నుంచి రూ.37,200కు పడిపోయింది.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఈ రోజు తగ్గింది. ఔన్స్‌కు 0.40 శాతం తగ్గుదలతో 1,466.75 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.27 శాతం క్షీణతతో 17.06 డాలర్లకు దిగొచ్చింది.ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.ఈ ఏడాది చివరికల్లా చైనాతో అమెరికా వాణిజ్య డీల్ ఓకే కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియోన్ మాట్లాడుతూ.. డిసెంబర్ కల్లా చైనాతో తొలి విడత డీల్ ఓకే కావొచ్చని తెలిపారు. దీంతో పసిడి ధరపై ఒత్తిడి నెలకొంది.

No comments:

Post a Comment