Breaking News

09/12/2019

సైబీరియన్ పక్షులకు కరెంట్ తీగ టెన్షన్

రాజమండ్రి, డిసెంబర్ 9, (way2newstv.in)
పెన్‌ బిల్‌ బర్డ్స్‌గా పిలిచే ఈ పక్షులు రాజమహేంద్రవరానికి అత్యంత చేరువలో ఉన్న పుణ్యక్షేత్రానికి ఏటా జూన్, జూలై మాసంలో (తొలకరి చినుకులు పడే సమయం) క్రమం తప్పకుండా సైబిరీయా నుంచి ఇక్కడకు వలస వస్తుంటాయి. వీటి ముక్కు మధ్యలో రంధ్రంగా ఉండటంతో స్థానికులు ‘చిల్లు ముక్కు కొంగ’లని కూడా పిలుస్తుంటారు. వందల కొలదిగా ఇక్కడకు వచ్చిన ఈ పక్షులు గ్రామంలోని ఊర చెరువు చుట్టూ ఉన్న కంచి చెట్లపై గూళ్లు ఏర్పాటుచేసుకుని గుడ్లు పొదుగుతాయి. వాటి నుంచి పిల్లలు బయలు దేరిన తరువాత డిసెంబర్, జనవరి మాసంలో (మాఘమాసంలో) ఆ పిల్ల పక్షులతో కలసి వేల కొలదిగా ఇక్కడ నుంచి తిరిగి పయనమవుతాయి. మళ్లీ జూన్, జూలై మాసం వచ్చే వరకు వీటి జాడ ఎవరికీ తెలియదు.
సైబీరియన్ పక్షులకు కరెంట్ తీగ టెన్షన్

పుణ్యక్షేత్రం వాసులు తమ ఆడపడుచుల్లా చూసుకునే ఈ సైబీరియన్‌ పక్షులు మాయమవడానికి ఊరచెరువు పై నుంచి వెళ్లిన హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు కారణమని కొంతమంది అంటుంటే, కాదు ఈ మధ్య భారీగా బాణసంచా కాల్చడంతోనే భయపడి వెళ్లిపోయాయని మరికొందరంటున్నారు. ఏది ఏమైనా అవి స్వేచ్ఛగా విహరించేందుకు అనువైన వాతావరణం ఇక్కడ క్రమేణా కనుమరుగైపోతోందనేది వాస్తవం. ఎందుకంటే అవి విహరించే ఊర చెరువు చుట్టూ కంచి చెట్లు ఉన్నాగాని వాటి పై నుంచి వెళ్లిన హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు వాటి పాలిట మృత్యు గీతాలను ఆలపిస్తున్నాయి.కాని ఈసారి ఏమైందో ఏమోగాని ఒక్కసారిగా మాయమైపోయి. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు సమీపంలోని ఊర చెరువు చుట్టూ ఉన్న కంచివిత్తనం చెట్లపై ఉండే ఈ పక్షులు తిరుగు ప్రయాణానికి ఇంకా సమయం ఉండగా రెండు నెలలు ముందే ఒక్కసారిగా గ్రామాన్ని వదిలిపోవడం గ్రామస్తులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. వీటి రాకతో తొలకరి పనులు ప్రారంభించే ఈ ప్రాంత రైతులు పక్షులు హఠాత్తుగా మాయం కావడంతో ఇది శుభకరం కాదంటూ సెంటిమెంటుగా ఫీలవులున్నారు. కొందరైతే ఇవి మాయమైన నెల రోజుల నుంచి మాకు ఆరోగ్యాలు కూడా బాగుండడం లేదంటున్నారు. ఎందుకంటే వీటిని పురుడు పోసుకునేందుకు తమ ఇంటికి వచ్చిన ఆడపడుచుల్లా భావిస్తారు. తమ తాతముత్తాల కాలం నాటి నుంచి ఈ విధంగా క్రమం తప్పకుండా వలస వచ్చే ఈ విదేశీ విహంగాలపై ఆ గ్రామస్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు హద్దులు ఉండవు.వీటిని విదేశీ పక్షులంటే పుణ్యక్షేత్రం వాసులు అసలు అంగీకరించరు. ఎందుకంటే అవి పుట్టింది ఇక్కడేనంటారు. ఈ సమయంలో ఇక్కడకు వచ్చి సంతానోత్పత్తిని చేసుకుని తిరిగి వెళ్తున్నాయి కాబట్టి విదేశీ పక్షులనడం సరికాదంటారు. అందుకనే వాటిని పురిటికి పుట్టింటికి వచ్చే ఆడపడచుల్లా భావించి, ఆదరిస్తారు. నెత్తిమీద రెట్ట వేసినా, చంకన ఉన్న పసివాడు దుస్తుల్ని ఖరాబు చేసిన మాదిరిగా వాటిని కూడా చూస్తారేగాని చీదరించుకోరు. గూళ్లకు చేరుకునే సమయంలో ఆ పక్షులు పెట్టే కీచుకీచు ధ్వనులను కూడా పిల్లల సందడిగానే భావిస్తారుగాని ‘ఇదేం గోలరా బాబూ’ అని ఈసడించుకోరు. గూళ్ల నుంచి పక్షి పిల్లలు జారి పడితే వాటిని జాగ్రత్తగా తిరిగి ఆ గూళ్లలోనే చేరవేస్తారు. అసలు తమ గ్రామానికి ‘పుణ్యక్షేత్రం’ అనే పేరు కూడా వీటిరాక కారణంగానే వచ్చిందేమోననే అనుభూతిని వ్యక్తం చేస్తూ, వాటి ఉనికిని శుభకరంగా భావిస్తుంటారు.

No comments:

Post a Comment