Breaking News

02/11/2019

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ రాజీనామా

నిజామాబాద్ నవంబర్ 02,(way2newstv.in):
తెలుగుదేశం పార్టీకి  మాజీ ఎమ్మెల్యే  అన్నపూర్ణమ్మ,  ఆమె తనయుడు  డాక్టర్ మల్లిఖార్జున్  రెడ్డి  లు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణలో ప్రజలు తెలుగుదేశం పార్టీ ని  విశ్వసించడం లేదు కాబట్టి, ప్రజలు అభిమానులు, కార్యకర్తల మనోభీష్టం మేరకు  రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. రాజీనామా పత్రాన్ని  మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు  చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు .
టీడీపీకి  మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ రాజీనామా

స్వర్గీయ ఏలేటి మహిపాల్ రెడ్డి   తెలుగుదేశం పార్టీ  ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ నాయకత్వంలో  ఎమ్మెల్యేగా, మంత్రిగా , సమితి అద్యక్షుడిగా , జిల్లా పార్టీ అద్యక్షునిగా పనిచేశారని అన్నపూర్ణమ్మ గుర్తు చేశారు. మహిపాల్ రెడ్డి  హఠాన్మరణం తర్వాత కార్యకర్తల కోరిక మేరకు తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని, ఓడినా గెలిచినా పార్టీ అభివృద్దికి కృషి చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు .  పార్టీలో తమకు సహకరించినందుకు గాను  చంద్రబాబుకు అన్నపూర్ణమ్మ, మల్లిఖార్జున్ రెడ్డి  లు  కృతజ్ఙతలు తెలిపారు.

No comments:

Post a Comment