Breaking News

12/10/2019

ఏసీబీ వలలో డ్రగ్ ఇన్స్పెక్టర్

హైదరాబాద్ అక్టోబరు 12  (way2newstv.in)
బ్లడ్ బ్యాంకుకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను లంచంగా తీసుకున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి  ఏసీబీకి అడ్డంగా దొరికి పోయింది. ఒక బ్లడ్ బ్యాంకుకు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేందుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి  లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసింది. 
ఏసీబీ వలలో  డ్రగ్ ఇన్స్పెక్టర్

అదికుడా బంగారు ఆభరణాల రూపంగా కావాలని అడిగింది. గతంలోనూ ఇదే బ్లడ్ బ్యాంకు నుంచి లక్ష్మీ రూ.50 వేలు లంచం తీసుకున్నట్టు సమాచారం. విసిగెత్తిన బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు ఏసీబీకి ఫిర్యాదు చేసారు. దాంతో రంగంలో దిగిన అధికారులు లక్ష్మి ని రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment