Breaking News

29/10/2019

అడ్వకేట్ జనరల్, ఆర్టీసీ అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం

హైదరాబాద్ అక్టోబర్ 29 (way2newstv.in)
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్.. మంత్రి పువ్వాడ, అడ్వకేట్ జనరల్, ఆర్టీసీ అధికారులతో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం ముగిసింది. ఈ భేటీలో హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై.. అడ్వకేట్ జనరల్, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 
అడ్వకేట్ జనరల్, ఆర్టీసీ అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం

ఈ సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరగనుంది. నిన్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారం నాటికి 25వ రోజుకు చేరింది.

No comments:

Post a Comment